హెర్బల్ ఇమ్యూనిటీ బూస్టర్లు:  ఈ సహజ సమ్మేళనాలు ఆరోగ్య పరిరక్షకాలు

Img Src : iStockphoto

ప్రకృతి అందించిన ఔషధీయ మూలికలు, మొక్కల నుంచి ఆరోగ్య ప్రయోజనాలు పోందేవచ్చు. వాటిలోని సహజ ఔషధ గుణాలు మనకు తెలియకుండానే శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటీ అసరాతోనే కరోనా కష్టకాలాన్ని దాటేలా చేసింది ఆయుర్వేదం.

Img Src : iStockphoto

ఈ ఔషధీయ మూలికలలో పుదీనా, తులసి, మెంతులు, ధనియాలు, దాల్చిన చెక్క, త్రిఫల, అతిబల, అశ్వగంధ, తిప్పతీగ వంటివి ఉన్నాయి. వీటిలో అన్నీ తాజాగా లభ్యం కావు కాబట్టి వాటి పోడులను కూడా వినియోగించుకుని ప్రయోజనం పోందవచ్చు.

Img Src : iStockphoto

ఈ మూలికలను గ్లాసు నీటిలో నానబెట్టి మరుసటి ఉదయం ఒడ గట్టి తాగడం వల్ల శరీరం, మనస్సు అద్భుతంగా పునరుజ్జీవం పోందుతుంది. ఈ నీరు తీసుకోవడం సహజమైన అభ్యాసంగా మారితే అనేక వ్యాధులను దరిచేరనీయదు.

Img Src : iStockphoto

నీటిలో శీతలీకరణ లక్షణాలతో పాటు జీర్ణక్రియను ప్రేరేపించి, వ్యవస్థను శుభ్రపరుస్తుంది. దీనిలో ఔషధ గుణాల మూలికల ఉన్న కారణం చేతా వాటిలోని కీలకమైన నూనెలను నీరు గ్రహిస్తుంది. వీటిని తాగడం వల్ల సహజ రోగనిరోధక శక్తి పెరిగుతుంది.

Img Src : iStockphoto

మెంతులు.. పోషకాలు, ఔషధ గుణాల పవర్‌హౌస్. నానబెట్టిన మెంతి నీటిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. అపానవాయువు, అజీర్ణం, జీర్ణ సమస్యలతో పాటు నీరు నిలుపుదలను నివారిస్తాయి.

Img Src : iStockphoto

నానబెట్టిన మెంతి నీటితో ప్రయోజనాలు:

మెంతుల్లోని అమైనో ఆమ్లాల సమ్మేళనాలు ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. 1-2 టీస్పూన్ల మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Img Src : iStockphoto

మెంతులను నీటిలో నానబెట్టే విధానం:

తులసి యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటిపైరేటిక్, యాంటిసెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్‌తో సహా లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఇమిడివున్నాయి. ఈ ఆకులు చర్మ ఆరోగ్యం మెరుగుపర్చ, అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేస్తుంది.

Img Src : iStockphoto

నానబెట్టిన తులసి నీరుతో ప్రయోజనాలు:

నానాబెట్టిన తులసి నీరు జ్వరం, జలుబు, దగ్గు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. తులసి నీరు ప్రభావవంతమైన మూత్రవిసర్జనగా పనిచేస్తుంది. మూత్రపిండాల నుండి విషాన్ని, వ్యర్థాలను బయటకు పంపుతుంది. గ్లాసు నీటిలో 5-6 తులసీ ఆకులు వేసి నానబెట్టాలి.

Img Src : iStockphoto

తులసి ఆకులను నీటిలో నానబెట్టే విధానం:

ఎర్రచందనం (ఇండియన్ రెడ్‌వుడ్) చెట్టు బెరడులో ఔషధ గుణాలు అపారం. ఇవి మూత్రపిండాల రుగ్మతలు, మధుమేహం, రక్తపోటు, చర్మ వ్యాధుల చికిత్సలో సహాయపడతాయి. ఎర్రచందనం నానబెట్టిన నీరు దాహార్తిని తీర్చుతుంది.

Img Src : iStockphoto

ఎర్రచందనం నీటితో ప్రయోజనాలు:

ఎర్రచందనం చెట్టు బెరడులను లేదా వాటి పోడిని నీటిలో 5 నిమిషాలు ఉడకబెట్టి, ఆ నీటిని వడకట్టి, సేవించడం వల్ల చర్మ ఛాయకు అదనపు నిగారింపు వస్తుంది. శరీర కణాలు, కణజాలాలను పునరుజ్జీవింపజేస్తుంది.

Img Src : iStockphoto

ఎర్రచందనం నీటితో తీసుకునే విధానం:

ధనియాలు.. రుచిని జోడించే ఈ సుగంధ ద్రవ్యం భారతీయ వంటకాల్లో డిమాండ్ ఎక్కువ. వీటిలో అజీర్ణం, మలబద్ధకం, పొత్తికడుపు తిమ్మిరి, సాధారణ జలుబు వంటి జీర్ణశయాంతర సమస్యలకు చికిత్స చేయడంలో ఆయుర్వేదమే సిఫార్సు చేస్తోంది.

Img Src : iStockphoto

ధనియాల వాటర్

వీటిలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, అస్థిర నూనెలు పుష్కలం. ధనియా నీటిని తాగడం వల్ల అసిడిటీ, నోటిపూత, మధుమేహం, కీళ్లనొప్పులు, తలనొప్పిని నివారిస్తుంది. ధనియాలను గోరువెచ్చని నీటిలో 15 నిమిషాలు నానబెట్టి, వడకట్టి త్రాగాలి.

Img Src : iStockphoto

ధనియాలు నానబెట్టే విధానం:

దాల్చినచెక్క, ప్రధానమైన మసాలా దినుసు. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆక్సికరణ ఒత్తిడి, మంటను తగ్గిస్తాయి. మొటిమలు సహా చర్మ సమస్యలతో పోరాడుతాయి.

Img Src : iStockphoto

దాల్చిన చెక్క నీరు

దాల్చిన చెక్క బెరడు పొడిని గోరువెచ్చని నీటితో కలుపుకుని తాగితే మనస్సు, శరీరానికి ఓదార్పులభిస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రించి, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. దంత కావిటీస్‌ను నివారించడంతో పాటు నోటి దుర్వాసనను తాజాగా మారుస్తుంది.

Img Src : iStockphoto

దాల్చిన చెక్క నీటితో తీసుకునే విధానం

త్రిఫలం (ఉసిరి, కరక్కాయ, తానికాయ) మిశ్రమాన్ని ఆయుర్వేదంలో డీటాక్సీఫైయర్, బేధిమందుగా వాడుతారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని అందిస్తాయి. జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు దరి చేరనీయదు. ఇది చర్మానికి కాంతినిస్తుంది.

Img Src : iStockphoto

త్రిఫల నీరు

త్రిఫల మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కలుపి అప్పుడే సేవించవచ్చు. దీని బలమైన భేదిమందు లక్షణాల కారణంగా మలబద్ధకం సహా వ్యర్థాలను తొలగిస్తుంది. ఒక టీస్పూన్ త్రిఫల పొడిని గోరువెచ్చని నీళ్లలో వేసి రోజూ సేవించండి.

Img Src : iStockphoto

త్రిఫల నీటితో తీసుకునే విధానం